Mumbai Test: భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న అజాజ్ పటేల్

ABN , First Publish Date - 2021-12-03T21:31:28+05:30 IST

భారత్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ విజృంభిస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ కోల్పోయిన నాలుగు

Mumbai Test: భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న అజాజ్ పటేల్

ముంబై: భారత్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ విజృంభిస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. శుభమన్ గిల్ 44, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యారు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 85 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-12-03T21:31:28+05:30 IST