England vs India: రోహిత్ అవుట్
ABN , First Publish Date - 2021-09-02T21:53:05+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. క్రిస్ వోక్స్ బౌలింగులో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన భారత జట్టు ఇన్నింగ్స్ను కాస్తంత దాటిగానే ఆరంభించింది. రోహిత్, కేఎల్ రాహుల్ వడివడిగా పరుగులు తీశారు. శామ్ కరన్ స్థానంలో జట్టులోకి వచ్చిన క్రిస్ వోక్స్ తొలి వికెట్ తీసుకుని జట్టు నిర్ణయం సరైనదేనని నిరూపించాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. ఇండియా వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. రాహుల్ (17), పుజారా క్రీజులో ఉన్నారు.