నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్.. శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీ
ABN , First Publish Date - 2021-11-25T21:02:16+05:30 IST
న్యూజిలాండ్తో ఇక్కడి గ్రీన్పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు
కాన్పూరు: న్యూజిలాండ్తో ఇక్కడి గ్రీన్పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 21 పరుగులకే మయాంక్ అగర్వాల్ (13) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారాతో కలిసి శుభమన్ గిల్ జాగ్రత్తగా ఆడుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత కాసేపటికే జెమీసన్ బౌలింగులో బౌల్డయ్యాడు. 93 బంతులు ఎదుర్కొన్న గిల్ 5 ఫోర్లు, సిక్సర్తో 52 పరుగులు చేశాడు. అనంతరం చతేశ్వర్ పుజారా (26) కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ చతేశ్వర్ పుజారా 35 పరుగులు చేసి జెమీసన్ బౌలింగులో బౌల్డయ్యాడు.
మరోవైపు క్రీజులో పాతుకుపోయిన శ్రేయాస్ అయ్యర్ (54) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవీంద్ర జడేజా అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం 70 ఓవర్లు ముగిశాయి. టీమిండియా 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.