England vs India: రాహుల్ మళ్లీ సేమ్ సీన్

ABN , First Publish Date - 2021-09-02T22:25:58+05:30 IST

నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా

England vs India: రాహుల్ మళ్లీ సేమ్ సీన్

లండన్: నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ల పతనం మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా 28 పరుగుల వద్ద రోహిత్ శర్మ (11) రూపంలో తొలి వికెట్ కోల్పోగా, ఆ తర్వాత అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న రాహుల్ ఈసారి కూడా దారుణంగా అవుటయ్యాడు. 44 బంతులు ఆడి 17 పరుగులు మాత్రమే చేసిన రాహుల్.. రాబిన్సన్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుత చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. ఇండియా రెండు వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది.

Updated Date - 2021-09-02T22:25:58+05:30 IST