మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే ఇలా..

ABN , First Publish Date - 2021-08-29T00:09:11+05:30 IST

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడి హెడింగ్లీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 76

మూడేళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లండ్ చేతిలోనే ఇలా..

లీడ్స్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇక్కడి హెడింగ్లీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీసేన మూడేళ్ల తర్వాత మళ్లీ దారుణ పరాభవాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే కుప్పకూలిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజే 278 పరుగులకు ఆలౌట్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. కోహ్లీ సేన ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2018లో ఇదే ఇంగ్లండ్ జట్టుతో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి. 

Updated Date - 2021-08-29T00:09:11+05:30 IST