భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులకు తీపి కబురు
ABN , First Publish Date - 2022-03-17T13:04:16+05:30 IST
కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ-టూరిస్ట్ వీసాలు సహా సాధారణ పేపర్ వీసాలను భారత్ పునరుద్ధరించింది.
టూరిస్ట్ వీసాలపై సస్పెన్షన్ ఎత్తివేత: కేంద్రం
ఈ-టూరిస్ట్ వీసాలు సహా సాధారణ పేపర్ వీసాల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: కరోనా కారణంగా రెండేళ్ల క్రితం నిలిపివేసిన ఈ-టూరిస్ట్ వీసాలు సహా సాధారణ పేపర్ వీసాలను భారత్ పునరుద్ధరించింది. ఈ మేరకు 156 దేశాల పౌరులకు ఇచ్చిన 5 ఐదేళ్ల వీసాలపై స స్పెన్షన్ను ఎత్తివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపా రు. ఈ పునరుద్ధరణను కాలవ్యవధి తీరిపోని వీసాలకే వర్తింపజేశామన్నారు. అలాగే, అమెరికా, జపాన్ పౌరులకు ఇచ్చిన సుదీర్ఘ కాలవ్యవధి (10 ఏళ్లు) కలిగిన వీసాలను కూడా పునరుద్ధరించామని వెల్లడించారు.