స్వల్ప స్కోర్కే 4 వికెట్లను కోల్పోయిన భారత్
ABN , First Publish Date - 2020-12-02T16:43:47+05:30 IST
ఆసీస్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు స్వల్ప స్కోర్కే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. 82 పరుగులకే ...
ఓవల్: ఆసీస్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు స్వల్ప స్కోర్కే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. 82 పరుగులకే రెండు కీలకమైన వికెట్లను చేజార్చుకున్న తరుణంలో అయ్యర్ సహాయంతో కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో జంపా వీరిద్దరి బ్యాటింగ్ కు బ్రేక్ వేశాడు. జంపా బౌలింగ్లో భారీ షాట్కి ఆడబోయిన శ్రేయస్ అయ్యర్ (19) లబుషేన్కు క్యాచ్ ఇచ్చి వికెట్ను సమర్పించుకున్నాడు. తర్వాత వచ్చిన రాహుల్ కూడా అగర్ బౌలింగ్లో (5) పరుగులకే వెనుతిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కోహ్లీ (61), పాండ్య (9) పరుగులతో కొనసాగుతున్నారు.