ఆసియా స్క్వాష్‌ సెమీ్‌సలో భారత్‌

ABN , First Publish Date - 2021-12-03T08:29:01+05:30 IST

సియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాయి.

ఆసియా స్క్వాష్‌ సెమీ్‌సలో భారత్‌

కౌలాలంపూర్‌: ఆసియా స్క్వాష్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో భారత పురుషులు, మహిళల జట్లు సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. పురుషుల విభాగం పూల్‌-ఎ చివరి మ్యాచ్‌లో సౌరవ్‌, రమిత్‌, మహేశ్‌లతో కూడిన భారత బృందం 3-0తో ఇండోనేసియాను చిత్తుచేసింది. దీంతో లీగ్‌ దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లు నెగ్గి అజేయంగా సెమీస్‌ చేరింది. మహిళల విభాగంలో జోష్న, సునయన, ఊర్వశిలతో కూడిన భారత జట్టు పిలిప్పీన్స్‌, ఇరాన్‌పై గెలిచి సెమీ్‌సలో ప్రవేశించింది.   

Updated Date - 2021-12-03T08:29:01+05:30 IST