2070 కల్లా ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్: మోదీ

ABN , First Publish Date - 2022-03-08T19:59:04+05:30 IST

ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా..

2070 కల్లా ​కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్: మోదీ

న్యూఢిల్లీ: ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు. ''ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ యాస్పిరేషనల్ ఎకానమీ'' అనే అంశంపై మంగళవారంనాడు జరిగిన వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని చెప్పారు. ఆ దిశగా పనులు వేగవంతం చేయడానికి పర్యావరణ హిత ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు.


స్టార్టప్‌లు అభివృద్ధి దిశగా దూసుకు వెళ్లాలంటే ఎంట్రప్రెన్యూర్ షిప్, ఇన్నొవేషన్ అనేవి చాలా కీలకమని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం, నూతన ఆవిష్కరణలకు కృషి చేయడం, కొత్త వాణిజ్య మార్గాలపై దృష్టి సారించడం అవసరమని అన్నారు. శీఘ్ర వృద్ధి కోసం 2022-23 బడ్జెట్‌లో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ప్రధాని చెప్పారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని వృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పన పెట్టుబడులపై పన్నులు తగ్గించడం, ఎన్‌ఐఐఎఫ్, గిఫ్ట్ సిటీ, న్యూ డీఎఫ్ఐ‌లు వంటి సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఫైనాన్షియల్, ఎకనామిక్ గ్రోత్‌తు తాము ప్రయత్నించినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తిపై కూడా ప్రధాని ప్రశంసలు కురిపించారు. భారత్‌కు ఆర్థిక మంత్రి మహిళ కావడం, ప్రగతిశీలక బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టడం మనమంతా గర్వించే విషయమని అన్నారు.

Updated Date - 2022-03-08T19:59:04+05:30 IST