షాట్గన్ వరల్డ్క్పలో భారత్కు కాంస్యం
ABN , First Publish Date - 2021-02-28T09:29:23+05:30 IST
ఐఎ్సఎ్సఎఫ్ షాట్గన్ వరల్డ్క్పలో భారత్ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో మైరాజ్ అహ్మద్ఖాన్, అంగద్ వీర్ సింగ్ బజ్వా, గుర్జోత్ ఖంగురాతో కూడిన భారత త్రయం 6-2తో కజకిస్థాన్ జట్టుపై గెలుపొందింది...
కైరో: ఐఎ్సఎ్సఎఫ్ షాట్గన్ వరల్డ్క్పలో భారత్ కాంస్య పతకం సాధించింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో మైరాజ్ అహ్మద్ఖాన్, అంగద్ వీర్ సింగ్ బజ్వా, గుర్జోత్ ఖంగురాతో కూడిన భారత త్రయం 6-2తో కజకిస్థాన్ జట్టుపై గెలుపొందింది. అంగద్ తన మొత్తం 16 లక్ష్యాలను ఛేదించి జట్టు కాంస్యం నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో రష్యా 6-0తో చెక్రిపబ్లిక్ను ఓడించి స్వర్ణం కైవసం చేసుకొంది. కాగా, భారత మహిళల జట్టు కాంస్య పోరులో 4-6తో కజకిస్థాన్ జట్టు చేతిలో ఓడింది. రష్యా, చెక్రిపబ్లిక్ స్వర్ణ, రజత పతకాలు దక్కించుకొన్నాయి.