భారత్ జీడీపీలో 6 శాతం కోత ఉంటుంది: బార్క్‌లే

ABN , First Publish Date - 2020-08-16T05:26:23+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో ఆరు శాతం మేర కోత పడుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బార్క్‌లే ప్రకటించింది.

భారత్ జీడీపీలో 6 శాతం కోత ఉంటుంది: బార్క్‌లే

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీలో ఆరు శాతం మేర కోత పడుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ బార్క్‌లే ప్రకటించింది. గతంలో ఈ కోత 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసిన సంస్థ తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఆ అంచనాను సవరించింది. కరోనా కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడీపీ 25.5 శాతం మేర క్షీణిస్తుందని కూడా తెలిపింది. ఆ తరువాతి త్రైమాసికంలో ఈ కోత 8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండబోతోందని గతంలో అంచనా వేసిన బార్క్‌లే తాజాగా దాన్ని 7 శాతానికి కుదించింది. కరోనా కారణంగా భారత్‌తో పాటూ ప్రపంచంలో అనేక దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లినట్టు అక్కడి ప్రభుత్వం ఇటీవలే అంగీకరించింది. 

Updated Date - 2020-08-16T05:26:23+05:30 IST