తొలి వన్డేలో ఓడిన భారత్‌ జట్టుకు జరిమానా!

ABN , First Publish Date - 2020-11-28T23:22:38+05:30 IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓడిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సభ్యులు తమ మ్యాచ్

తొలి వన్డేలో ఓడిన భారత్‌ జట్టుకు జరిమానా!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఓడిన భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సభ్యులు తమ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోల్పోనున్నారు. స్లో ఓవర్ రేటును కెప్టెన్ కోహ్లీ అంగీకరించడంతో ఇక విచారణ అవసరం లేదని ఐసీసీ స్పష్టం చేసింది. నిర్ణీత సమయానికి భారత జట్టు ఒక్క ఓవర్ తక్కువగా వేసింది. ఆసీస్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో భారత్ 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండో వన్డే రేపు సిడ్నీ క్రికెడ్ గ్రౌండ్‌లో జరగనుంది.  

Updated Date - 2020-11-28T23:22:38+05:30 IST