మాల్దీవులకు భారత్ భారీ ఆర్థిక సాయం !
ABN , First Publish Date - 2020-09-21T12:15:44+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మాల్దీవులకు భారత్ రూ.1800 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది.
మాలె, సెప్టెంబరు 20: కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మాల్దీవులకు భారత్ రూ.1800 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ మేరకు మాలెలోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. కరోనాతో సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం అందించాలని అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి భారత ప్రధాని మోదీకి చేసిన విజ్ఞప్తి మేరకు భారత్ ఈ సాయాన్ని అందించింది.