భారత్లో మరో మెట్టెక్కిన కరోనా.. తాజా అప్డేట్ ఏంటంటే..
ABN , First Publish Date - 2020-06-03T02:58:58+05:30 IST
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. భారత్లో కరోనా వ్యాపించిన...
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. భారత్లో కరోనా వ్యాపించిన నెలల వ్యవధిలో లక్ష కేసులు దాటితే.. గత 14 రోజుల్లో లక్ష నుంచి 2 లక్షలకు కరోనా కేసులు చేరడం కొంత ఆందోళన కలిగించే విషయం. 24 గంటల వ్యవధిలో భారత్లో 8,171 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఆరో స్థానంలో 2.33 లక్షల కరోనా పాజిటివ్ కేసులతో ఇటలీ ఉండటం గమనార్హం.
అయితే.. భారత్లో ఇప్పటిలానే కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగితే ఇటలీని పక్కకు నెట్టేసి ఆరో స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదనేది వైద్య నిపుణుల అంచనా. గత మూడు రోజులుగా భారత్లో 8 వేలకు మించి కరోనా పాజిటివ్ నమోదవుతున్న పరిస్థితి ఉంది. భారత్లో కరోనా హాట్ స్పాట్గా 70,000 పైచిలుకు కేసులతో మహారాష్ట్ర ఉన్న సంగతి తెలిసిందే.