భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

ABN , First Publish Date - 2020-08-04T16:22:29+05:30 IST

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

భారత్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 803 మంది మృతి చెందారు. దీంతో  దేశంలో ఇప్పటి వరకు 18,55,746 కరోనా కేసులు నమోదు అవగా... 38,938 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా 5,86,298 యక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 12,30,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 66.31 శాతం కాగా... మరణాల రేటు 2.10 శాతంగా ఉంది. 

Updated Date - 2020-08-04T16:22:29+05:30 IST