దేశవ్యాప్తంగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం
ABN , First Publish Date - 2021-06-21T15:23:41+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,256 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 1,422 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 78,190 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 2,88,44,199గా నమోదు అయ్యింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 7,02,887 ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,88,135కి చేరింది. ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 28,00,36,898గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.