దేశంలో గడిచిన 24 గంటల్లో 18,870 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-29T15:35:28+05:30 IST
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...378 మంది మృతి చెందారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,870 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...378 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 28,178 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 3,37,16,451కి చేరింది. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,86,180గా ఉంది. ప్రస్తుతం 2,82,520 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,47,751గా ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం 87,66,63,490 టీకా తీసుకున్నారు.