భారత్లో కొత్తగా 1,007 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-04-14T16:29:08+05:30 IST
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,007 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,007 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 11,058 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03 శాతం కాగా, రికవరీ రేటు ప్రస్తుతం 98.76 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 818 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం 83.08 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 4,34,877 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిగాయి. అలాగే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 186.22 కోట్ల వ్యాక్సిన్ డోస్ల పంపిణీ జరిగింది.