భారత్లో కొత్తగా 7,974 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-16T16:37:12+05:30 IST
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 7,948 మంది డిశ్చార్జ్ అవగా... 343 మంది మృతి చెందారు. ప్రస్తుతం 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో 4,76,478 మంది మృత్యువాతపడ్డారు. అలాగే 1,35,25,36,986 మంది టీకా తీసుకున్నారు.