భారత్లో స్వల్పంగా పెరుగుతున్న Corona కేసులు
ABN , First Publish Date - 2022-01-03T16:06:44+05:30 IST
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 33,750 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా... 123 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 10,486 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582గా ఉండగా, కోలుకున్న వారి సంఖ్య 3,42,95,407గా ఉంది. దేశ వ్యాప్తంగా కోవిడ్తో 4,81,893 మంది మృతి చెందారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,45,68,89,306గా ఉంది.