భారత్‌లో క్రమంలో పెరుగుతున్న కొవిడ్ ఉధృతి

ABN , First Publish Date - 2022-05-02T15:15:26+05:30 IST

దేశంలో కొవిడ్ ఉధృతి మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతోంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

భారత్‌లో క్రమంలో పెరుగుతున్న కొవిడ్ ఉధృతి

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ ఉధృతి మళ్లీ క్రమ క్రమంగా పెరుగుతోంది. వరుసగా ఐదో రోజు మూడు వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కొత్తగా 3157 పాజిటివ్ కేసులు నమోదు అవగా... 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 19,500 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,30,82,345 కేసులు నమోదు అవగా... 5,23,869 మరణాలు సంభవించాయి.  కరోనా రికవరీ రేటు  98.74 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి  2723 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,25,38,976గా ఉంది. 

Updated Date - 2022-05-02T15:15:26+05:30 IST