Indiaలో కరోనా కేసులు తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-02-07T15:08:59+05:30 IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో దాదాపు మూడున్నర లక్షల వరకు చేరుకున్న కేసులు... తాజాగా లక్ష కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.

Indiaలో కరోనా కేసులు తగ్గుముఖం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో దాదాపు మూడున్నర లక్షల వరకు చేరుకున్న కేసులు... తాజాగా లక్ష కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,876 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు 895మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24 గంటల్లో 1,99,054 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,08,938గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు సంభవించిన మరణాల సంఖ్య 5,02,874గా నమోదు అయ్యింది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు  7.25% తగ్గింది. దేశంలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం 1,69,63,80,755 మంది టీకాలు వేయించుకున్నారు. 


Updated Date - 2022-02-07T15:08:59+05:30 IST