దేశంలో 35,662 కొత్త కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-09-18T16:00:16+05:30 IST
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 35,662 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 35,662 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 33,798 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,40,639 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,26,32,222గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది.