Indiaలో కొత్తగా 30,757 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-02-17T15:26:26+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతోంది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమక్రమంగా తగ్గుతోంది. దేశంలో కొత్తగా 30,757 కరోనా కేసులు నమోదు అవగా... 514 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 3,32,918 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి మరో 67,538 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతానికి తగ్గింది. దేశంలో కరోనా రికవరీ రేటు 97.94 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 174.26 కోట్ల కొవిడ్ డోసుల పంపిణీ జరిగింది.