ఫిఫా కప్లో భారత్ X బ్రెజిల్
ABN , First Publish Date - 2022-06-25T10:26:39+05:30 IST
మీరు చదువుతున్నది నిజమే. ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచక్పలో టాప్ జట్టు బ్రెజిల్ను భారత్ ఢీకొంటోంది.
న్యూఢిల్లీ: మీరు చదువుతున్నది నిజమే. ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచక్పలో టాప్ జట్టు బ్రెజిల్ను భారత్ ఢీకొంటోంది. అయితే, ఇది ఫిఫా మహిళల అండర్-17 ప్రపంచకప్లో. అక్టోబరు 11 నుంచి భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆతిథ్య జట్టు.. బ్రెజిల్, మొరాకో, అమెరికాలాంటి పటిష్ఠ జట్లు ఉన్న గ్రూపు-ఎ నుంచి తలపడనుంది.
ఆరంభ మ్యాచ్లో భాగంగా అక్టోబరు 11న అమెరికాతో భారత్ ఆడనుంది. అదేనెల 14న మొరాకోతో, 17న బ్రెజిల్తో తన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ పోటీపడనుంది. మొత్తం 16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్-బి నుంచి జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్.. గ్రూప్-సిలో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్, కొలంబియా, చైనా, మెక్సికో.. గ్రూప్-డిలో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఆడనున్నాయి.