ఆ తబ్లీగీలు భారత్‌ రాకుండా నిషేధం

ABN , First Publish Date - 2020-06-04T22:56:15+05:30 IST

న్యూఢిల్లీ: ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సదస్సుకు హాజరైన 960 మంది విదేశీ తబ్లీగీలను కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.

ఆ తబ్లీగీలు భారత్‌ రాకుండా నిషేధం

న్యూఢిల్లీ: ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌ సదస్సుకు హాజరైన 2550 మంది విదేశీ తబ్లీగీలను కేంద్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. వీరెవ్వరూ పదేళ్లపాటు భారత్‌కు రాకుండా చర్యలు తీసుకుంటోంది. వీరంతా వీసా నిబంధనలు ఉల్లంఘించి మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టూరిస్ట్ వీసాపై భారత్‌లోకి వచ్చి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా మతపరమైన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం వీసాలు ఉల్లంఘించిన 2550 మంది విదేశీ తబ్లీగీలపై ఆయా దేశాలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. ఈ తబ్లీగీలంతా థాయ్‌లాండ్, సింగపూర్, ఇండొనేషియా తదితర దేశాలకు చెందినవారు. 


మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్ సదస్సుకు వీరంతా హాజరయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోవడం ప్రమాదకరంగా మారింది. మార్చి 22 జనతా కర్ఫ్యూ తర్వాత సదస్సు జరిగిన భవనం నుంచి అధికారులు వేలాది మంది తబ్లీగీలను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. అంతకు ముందు కూడా వేలాది మంది తబ్లీగీలు వారి స్వస్థలాలకు చేరుకున్నారు. మర్కజ్ సదస్సుకు హాజరైన తబ్లీగీలకు వారి కుటుంబీకులకు కరోనా సోకింది. పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. వీరందరినీ ట్రేస్ చేయడానికి ప్రభుత్వ యత్రంగానికి చాలా సమయం పట్టింది. ఈలోగానే కరోనా మహమ్మారి మరింత విజృంభించింది. 

Updated Date - 2020-06-04T22:56:15+05:30 IST