భారత్- ఆస్ట్రేలియాల మధ్య కీలక ఒప్పందాలు.. సంతకాలు చేసిన మోదీ, మోరిసన్..

ABN , First Publish Date - 2020-06-05T03:02:51+05:30 IST

ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భద్రతా సహకారానికి సంబంధించి భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు..

భారత్- ఆస్ట్రేలియాల మధ్య కీలక ఒప్పందాలు.. సంతకాలు చేసిన మోదీ, మోరిసన్..

న్యూఢిల్లీ: ఇండో-పసిఫిక్ సముద్ర ప్రాంతంలో భద్రతా సహకారానికి సంబంధించి భారత్- ఆస్ట్రేలియా దేశాల మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మధ్య జరిగిన ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌-ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో ఇదో నూతన అధ్యాయమనీ.. పరస్పర వాణిజ్య సహకారం నూతన శిఖరాలను చేరేందుకు ఇది దోహద పడుతుందని మోదీ పేర్కొన్నారు. కాగా మోరిసన్ మాట్లాడుతూ.. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, ఉమ్మడి ప్రాధాన్యతలు ఇరు దేశాలు మరింత కలిసికట్టుగా పనిచేసేందుకు ఉపయోగపడతాయన్నారు.


తాజా ఒప్పందాలతో భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య భద్రత, రక్షణ సంబంధాల్లో మరో ముందడుగు పడినట్టైందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిస్ పేన్ ఈ సందర్భంగా  పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఇరు దేశాలు సైబర్, సైబర్-సామర్థ్య క్లిష్ట సాంకేతికతలో భాగస్వామ్యంపై కార్యాచరణ ప్రణాళికతో పాటు.. మైనింగ్‌, వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించి పలు ఎంవోయూల కుదిరాయి. రక్షణ రంగ సహకారంలో భాగంగా రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాలపైనా ఎంవోయూలు కుదిరాయి. ప్రజా పరిపాలన, పాలనా సంస్కరణలు, వృత్తి విద్య- శిక్షణ, నీటి వనరుల నిర్వహణలో సహకారం వంటి పలు ఒప్పందాలపైనా సంతకాలు జరిగాయి. 

Updated Date - 2020-06-05T03:02:51+05:30 IST