హనుమ విహారి సెంచరీ.. డకౌట్లలో భారత బ్యాట్స్మెన్ పోటీ!
ABN , First Publish Date - 2020-02-14T23:19:15+05:30 IST
టెస్టు సిరీస్కు ముందు న్యూజిలాండ్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో
హమిల్టన్: టెస్టు సిరీస్కు ముందు న్యూజిలాండ్ ఎలెవన్తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు బ్యాటింగ్ మళ్లీ నిరాశ పరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 263 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ తీవ్రంగా నిరాశపరిచారు. టీమిండియా ఆటగాళ్లలో నలుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు.
ఓపెనర్ పృథ్వీషా, శుభ్మన్ గిల్, వృధ్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్లు డకౌట్ కాగా, మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగు చేశాడు. రహానే 18, పంత్ 7, ఉమేశ్ యాదవ్ 8 పరుగులు చేశారు. అయితే, చతేశ్వర్ పుజారా, హనుమ విహారీలు క్రీజులో పాతుకుపోవడంతో భారత జట్టు ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పుజారా 93 పరుగులు చేసి ఏడు పరుగుల ముందు సెంచరీ చేజార్చుకోగా, హనుమ విహారీ సెంచరీ (101) చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్ 263 పరుగుల వద్ద ముగిసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో స్కాట్ కగ్గెలీన్, ఇష్ సోధీ చెరో మూడు వికెట్లు తీసుకోగా జేక్ గిబ్సన్ 2, జేమ్స్ నీషమ్ ఒక వికట్ పడగొట్టాడు.