వాణిజ్యానుకూలతలో భారత్ దూకుడు
ABN , First Publish Date - 2021-07-24T06:59:22+05:30 IST
డిజిటల్, సుస్థిర ట్రేడింగ్ విధానాల్లో భారత్ ర్యాంకింగ్ గణనీయంగా పెరిగింది.
న్యూఢిల్లీ: డిజిటల్, సుస్థిర ట్రేడింగ్ విధానాల్లో భారత్ ర్యాంకింగ్ గణనీయంగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల ఆసియా, పసిఫిక్ కమిషన్ (యునెస్కాప్) 2021 సంవత్సరానికి నిర్వహించిన ద్వైవార్షిక సర్వేలో భారత్ 90.32 శాతం స్కోరును సాధించింది. 2019లో సాధించిన స్కోరు 78.49 శాతం కన్నా ఇది ఎంతో అధికం.