బౌలర్లదీ అదే తీరు
ABN , First Publish Date - 2020-02-23T10:20:13+05:30 IST
భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఆధిపత్యం చూపుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89), రాస్ టేలర్ (44) సమయోచిత ఆటతీరుతో ప్రస్తుతం
తొలి రోజు బ్యాట్స్మెన్ తరహాలోనే రెండో రోజు బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అటు భారత లైనప్ తడబడిన పచ్చిక పిచ్పై కివీస్ మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరుగులు రాబట్టింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అర్ధసెంచరీ, రాస్ టేలర్ సమయోచిత ఆటతీరుతో ప్రస్తుతం కివీస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే ఆఖరి సెషన్లో భారత్ కాస్త పోటీలోకొచ్చి మూడు వికెట్లు తీయడం ఊరటనిచ్చింది. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఆకట్టుకున్నాడు. అంతకుముందు పేసర్లు సౌథీ, జేమిసన్ పదునైన బంతులకు చివరి ఐదు వికెట్లను కేవలం 43 పరుగుల తేడాతో కోల్పోయిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.