ఎన్ఎస్టీఎల్లో స్వాతంత్య్ర వారోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-12T05:57:16+05:30 IST
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఎన్ఎస్టీఎల్లో గురువారం స్వాతంత్య్ర వారోత్సలు ప్రారంభమయ్యాయి.
గోపాలపట్నం, ఆగస్టు 11: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఎన్ఎస్టీఎల్లో గురువారం స్వాతంత్య్ర వారోత్సలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర వారోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. టేబుల్ టెన్నిస్, వాలీబాల్ పోటీలతో పాటు స్వాతంత్య్ర ర్యాలీ, మొక్కలు నాటడం, ఫ్రీడమ్ వాక్, క్రికెట్ టోర్నమెంట్, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎన్ఎస్టీఎల్ కాంప్లెక్స్లోని పిచ్చయ్య ఇండోర్ స్టేడియంలో ఎన్ఎస్టీఎల్, జీవీఎంసీ, బీడీఎల్ టీమ్ల మధ్య నిర్వహించిన టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ శాస్త్రవేత్తలు గణేశ్కుమార్, డాక్టర్ శ్రీనివాసకుమార్, డాక్టర్ మను కోరుల్లా, ఎన్ఎస్టీఎల్ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.