నేడే స్వాతంత్య్ర సంబరం

ABN , First Publish Date - 2020-08-15T09:46:04+05:30 IST

స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఉదయం వన్‌టౌన్‌ ప్రాంతంలోని పోలీస్‌ మైదానంలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌

నేడే స్వాతంత్య్ర సంబరం

నగరంలోని పోలీస్‌ మైదానంలో జెండా ఆవిష్కరణ

ముఖ్య అతిథిగా మంత్రి ముత్తంశెట్టి


విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఉదయం వన్‌టౌన్‌ ప్రాంతంలోని పోలీస్‌ మైదానంలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తార న్నారు. జిల్లాలో ప్రభుత్వపరంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ప్రసంగిస్తారని, తరువాత కొవిడ్‌  విజేతలకు సన్మానిస్తారన్నారు. అలాగే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య, పోలీస్‌ శాఖలతోపాటు శానిటరీ ఉద్యోగుల్ని సత్కరిస్తామ న్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.

Updated Date - 2020-08-15T09:46:04+05:30 IST