గ్రామాల్లోని ప్ర‌తీ ఇంటికీ హైస్పీడ్ ఇంట‌ర్నెట్: ప‌్ర‌ధాని మోదీ

ABN , First Publish Date - 2020-08-15T17:52:53+05:30 IST

దేశం డిజిటల్ ఇండియా వైపు వేగంగా ప్ర‌యాణిస్తోంది. చాలా నగరాల్లో ఇంటర్నెట్ వాడకం త‌ప్ప‌నిసరి కావ‌డంతోపాటు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అవసరం మ‌రింత‌గా పెరిగింది. అటువంటి పరిస్థితిలో...

గ్రామాల్లోని ప్ర‌తీ ఇంటికీ హైస్పీడ్ ఇంట‌ర్నెట్: ప‌్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: దేశం డిజిటల్ ఇండియా వైపు వేగంగా ప్ర‌యాణిస్తోంది. చాలా నగరాల్లో ఇంటర్నెట్ వాడకం త‌ప్ప‌నిసరి కావ‌డంతోపాటు గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అవసరం మ‌రింత‌గా పెరిగింది. అటువంటి పరిస్థితిలో గ్రామాలను కూడా ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించాలని, తద్వారా ఇంటర్నెట్ అక్క‌డివారికి అందుబాటులోకి వస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. హైస్పీడ్ ఇంటర్నెట్ ద్వారా గ్రామీణుల‌ జీవితాల‌ను మార్చ‌వ‌చ్చ‌న్నారు. స్వాతంత్య్ర దినోత్స‌వ వేళ ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ 2014కి ముందు అతి త‌క్కువ సంఖ్య‌లో పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధాన‌మై ఉండ‌గా, గత ఐదేళ్ల‌లో ఒకటిన్నర లక్షల పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధాన‌మ‌య్యాయ‌న్నారు. అన్ని పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అందించడమే త‌మ‌ ప్రభుత్వం లక్ష్యమ‌ని, లక్ష పంచాయతీల‌లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ప‌నులు పనులు వేగంగా జరుగుతున్నాయ‌న్నారు.  

Updated Date - 2020-08-15T17:52:53+05:30 IST