Independence day: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

ABN , First Publish Date - 2022-08-15T14:42:17+05:30 IST

రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ (Indipendence day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Independence day: జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్

విజయవాడ: రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ (Indipendence day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) జాతీయ జెండాను (Tricolor flag) ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేయనున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖల శకటాలను అధికారులు సిద్ధం చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్విభూషన్ హరిచందన్ (Bishvibhushan Harichandan) తేనేటు విందు ఇవ్వనున్నారు. ఈ ఎట్ హోమ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.

Updated Date - 2022-08-15T14:42:17+05:30 IST