Jangareddygudemలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ABN , First Publish Date - 2022-08-15T19:50:05+05:30 IST

ఈ రోజు 75వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో

Jangareddygudemలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవం(Independence day) సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక 12, 13, 14వ వార్డుల ప్రజలు తెలుగుదేశం పార్టీ  (TDP) పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులో గల వాటర్ ట్యాంక్ వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా కొండ్రెడ్డి కిషోర్, బొబ్బర రాజ్ పాల్ కలిసి మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరావు కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు, ఆకుమర్తి రామారావు, పాతూరి అంబేద్కర్ ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి నాగేశ్వరావు, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, మీనా శ్రీను, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం, చిత్తపూరి దుర్గేష్, యడ్లపల్లి ఏడుకొండలు, పాకనాటి అంజి, శీలామంతుల రాంబాబు, ఎన్ని రాంబాబు, తెలగారపు సాయి, 12,13,14 వార్డుల సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Updated Date - 2022-08-15T19:50:05+05:30 IST