Independence day celebrations: పోలవరం టీడీపీ ఆఫీస్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
ABN , First Publish Date - 2022-08-15T16:09:50+05:30 IST
పోలవరం నియోజకవర్గం టీడీపీ క్యాంపు కార్యాలయం బుట్టాయగూడెంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
జంగారెడ్డిగూడెం(ఏలూరు జిల్లా): పోలవరం నియోజకవర్గం టీడీపీ (TDP) క్యాంపు కార్యాలయం బుట్టాయగూడెంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ (Idependence day) వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam srinivasulu) జాతీయ జెండా (National flag)ను ఎగురవేశారు. ఈ సందర్భంగా బొరగం మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలతో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సిద్ధించి నేడు సమాజంలో గౌరవంగా జీవించగలుగుతున్నామని అన్నారు. భారతదేశం ఆచార, సాంప్రదాయాలకు పెట్టిన పేరు అని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కలిమెలిసి దేశ అభ్యున్నతి కోసం అందరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సొంబాబు, ఏలూరు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంట్రప్రగడ శ్రీనివాసరావు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మానెల్లి బాలు, ఏలూరు పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం కన్నపరాజు, పోలవరం నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు మడకం రామకృష్ణ, నియోజకవర్గం ఉపాధ్యక్షులు తెల్లం వెంకటేష్, తెలుగుమహిళా నియోజకవర్గం కార్యదర్శి జారం చాందినీ సాగరిక, బిసి సెల్ మండల అధ్యక్షులు దెయ్యాల కృష్ణమోహన్, నియోజకవర్గం తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కుందుల శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి గుండెబోయిన మురళీకృష్ణ, బిర్రా. నాగభూషణం, సుకరా. వెంకట్రావు, మనికల.శ్రీను,అడవి రాముడు, బొబ్బర ఏలిషా, వరకా కృష్ణంరాజు, చిలకామూడి సుధాకర్, భీమేశ్వరరావు, తుర్రం ప్రసాద్, నేరం ప్రసాద్ కప్పల జోషి,గద్దె. దుర్గారావు, సోంపటి. దుర్గారావు,అరిపెల్లి. సత్యనారాయణ, కోర్స. దుర్గారావు, పూసులూరి. సర్వరాయూడు, జోడే. సిర్మరాజు, కోర్స. పోసిబాబు, మడిమి. ముత్యాలరావు, కుంజాం నాగు తదితరులు పాల్గొన్నారు.