పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-15T10:19:51+05:30 IST
జిల్లాలో రోజురోజుకు కరో నా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏరియాసుపత్రితోపాటు పలు పీ
మంచిర్యాల, ఆగస్టు 14 : జిల్లాలో రోజురోజుకు కరో నా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఏరియాసుపత్రితోపాటు పలు పీహెచ్సీలలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మంచిర్యాలలో 10, చెన్నూర్ 7, నస్పూర్ 4, దండేపల్లి 3, లక్షెట్టిపేట 8, బెల్లంపల్లి 8, నెన్నెలలో ఒకరికి పాజి టివ్ వచ్చింది. అలాగే జిల్లాకు చెందిన వారు ఇతర జిల్లాల్లో పరీక్షలు చేయించుకోగా 9 మందికి వ్యాధి సోకినట్లు తేలింది.