ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాం: ఎస్పీ రవీంద్రనాథ్

ABN , First Publish Date - 2020-04-03T19:48:41+05:30 IST

విజయవాడ: కృష్ణా జిల్లాలోని తెలంగాణ సరిహద్దులో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాం: ఎస్పీ రవీంద్రనాథ్

విజయవాడ: కృష్ణా జిల్లాలోని తెలంగాణ సరిహద్దులో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. అంబులెన్స్‌లను కూడా ఆపి వివరాలు సేకరిస్తున్నామన్నారు. అనుమతి పత్రాలు తెచ్చినప్పటికీ వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నామని రవీంద్రనాథ్‌ తెలిపారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించామన్నారు. ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ అని తేలిందన్నారు. ఇంకా వారి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ రవీంద్రనాథ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-04-03T19:48:41+05:30 IST