దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రో ధరలు

ABN , First Publish Date - 2021-10-17T18:10:20+05:30 IST

రెండు రోజుల విరామం అనంతరం వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ: రెండు రోజుల విరామం అనంతరం వరుసగా నాలుగు రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఆదివారం దేశవ్యాప్తంగా స్వల్పంగా  పెట్రోల్, డీజిల్ ధరలు  పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, అలాగే డీజీల్‌పై కూడా 35 పైసలు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు... ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 105.84, డీజిల్ రూ.94.57, ముంబైలో లీటరు పెట్రోల్ రూ.111.77, డీజిల్ రూ.102.52, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ రూ.106.44, డీజిల్ రూ.97.68, బెంగళూరులో లీటరు పెట్రోలు రూ.109.37, లీటరు డీజిలు రూ.100.37 ఉంది.

Updated Date - 2021-10-17T18:10:20+05:30 IST