పెరిగిన ప్రయాణికుల రద్దీ : జీఎంఆర్ ఎయిర్పోర్ట్
ABN , First Publish Date - 2022-04-04T09:53:32+05:30 IST
శంషాబాద్లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ క్రమంగా పుంజుకుంటోంది.
పెరిగిన ప్రయాణికుల రద్దీ : జీఎంఆర్ ఎయిర్పోర్ట్
హైదరాబాద్: శంషాబాద్లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ క్రమంగా పుంజుకుంటోంది. గత నెల 27న ఈ విమానాశ్రయం నుంచి ఒకే రోజు దాదాపు 53,000 మంది దేశీయ విమాన ప్రయాణికులు ప్రయాణించారు. ఇది కొవిడ్కు ముందున్న రోజువారీ సగటుతో పోలిస్తే 109 శాతం. అదేరోజు ఈ ఎయిర్పోర్టు నుంచి 374 ఎయిర్ ట్రాఫిక్ మూవ్మెంట్స్ (ఏటీఎం) నమోదయ్యాయి. కొవిడ్ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఇంత పెద్దఎత్తున విమానాల మూవ్మెంట్స్ నమోదవడం ఇదే మొదటిసారని అధికార వర్గాలు తెలిపాయి.