పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలి

ABN , First Publish Date - 2020-05-22T10:42:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను వెం టనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాండ్‌

పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలి

టీడీపీ నేతల డిమాండ్‌ జిల్లావ్యాప్తంగా దీక్షలు


మార్కాపురం, మే 21: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను వెం టనే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు స్థానిక జవహర్‌ నగర్‌ కాలనీలోని ఆయన గృహంలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు.  కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి సత్యనారాయణ,  కొప్పుల శ్రీనివాసరావు, మలిపెద్ది సుబ్రమణ్యం పాల్గొన్నారు. నాయుడు బజారులోని తన స్వగృహంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వక్కలగడ్డ రాధికా మల్లికార్జున్‌, వక్కలగడ్డ మల్లికార్జున్‌ నిరాహార దీక్ష చేశారు.


  • పొదిలిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు వారి వారి ఇళ్ల వద్ద దీక్షలు చేపట్టారు. నిరసన చేపట్టిన వారిలో మైనార్టీ సెల్‌ జిల్లా నాయకులు డాక్టర్‌ ఇమాంసా, మాజీ వార్డు సభ్యురాలు కరిమున్‌, మైనార్టీ మహిళా కార్యదర్శి షహనాజ్‌,  ముల్లా ఖుద్దుస్‌, ఖాశింబీ తదితరులు ఉన్నారు. 

  • తర్లుపాడులో జరిగిన దీక్షలో మాజీ ఎంపీపీ పులి వేముల ఏసుదాసు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బుదాల పెద్దన్నా,  యేలిమేల కాశ య్య, తదితరులు పాల్గొన్నారు. 

  • దర్శిలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు నివాసంలో జరిగిన దీక్షలో టీడీపీ మండల అధ్యక్షుడు నారపుశెట్టి పిచ్చయ్య, సం గా తిరుపతిరావు,  రమణారెడ్డి, సందు రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

  • మద్దిపాడులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన దీక్షలో పార్టీ మండ ల అధ్యక్షుడు మండవ జయంత్‌బాబు, ముత్తనపల్లి రామలింగయ్య, రె బ్బవరపు ప్రభాకర్‌, అనిల్‌, రఘురామ్‌, ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. 

  • చీమకుర్తిలోని టీడీపీ కార్యాలయ ఆవరణలో జరిగిన దీక్షలో పార్టీ నాయకులు కొండ్రగుంట వెంకయ్య, మన్నం ప్రసాద్‌, గొట్టిపాటి రాఘవ రావు, సుబ్బారావు, బ్రహ్మరెడ్డి, ఎస్‌.ఆంజనేయులు పాల్గొన్నారు.

  • విద్యుత్‌ బిల్లుల పెంపుపై చీరాలలోని తన నివాస ప్రాంగణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం భౌతిక దూరం పాటిస్తూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ  నిరసన తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

  • కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ముక్కు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు జ రిగిన కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, రాచమల్ల శ్రీను, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, జంషీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

  • వెలిగండ్లలో టీడీపీ మండల ఎస్సీ సెల్‌ నాయకులు సాల్మన్‌ రాజు, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, మౌలాలి, కారంపూడి కృష్ణారావు నిరసన వ్యక్తం చేశారు. 

  • పేదలపై విద్యుత్‌ చార్జీలు మోపడం తగదని పేర్కొంటూ పామూ రులో విద్యుత్‌ డీఈఈ పి.సుందరరావుకు  టీడీపీ నాయకులు  వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు బీవి భోజ య్య చారి, గంగరాజుయాదవ్‌, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

  • యద్దనపూడి మండలం గన్నవరంలో టీడీపీ మండల అధ్యక్షడు రంగయ్య చౌదరి నిరాహారదీక్ష చేశారు. 

  • ఎర్రగొండపాలెంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు మన్నే రవీంద్ర ఆధ్వ ర్యంలో నిరాహార దీక్ష చేశారు.

Updated Date - 2020-05-22T10:42:50+05:30 IST