లాక్‌డౌన్‌లో బాలలపై పెరిగిన నేరాలు

ABN , First Publish Date - 2020-07-05T08:00:04+05:30 IST

లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా బాలలపై వేధింపులు, అత్యాచారాలు తదితర నేరాలు పెరుగుతున్నాయంటూ బాలల హక్కుల కార్యకర్తలు

లాక్‌డౌన్‌లో బాలలపై పెరిగిన నేరాలు

హైదరాబాద్‌, జూలై 4(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా బాలలపై వేధింపులు, అత్యాచారాలు తదితర నేరాలు పెరుగుతున్నాయంటూ బాలల హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐడీఎం) సంయుక్త ఆధ్వర్యంలో  ‘కొవిడ్‌లో బాలల హక్కుల రక్షణ’ అనే అంశంపై శనివారం జాతీయ స్థాయి వెబినార్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ ప్రారంభమైన మొదటి వారంలోనే బాలలపై నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 90వేల కేసులు నమోదైన విషయాన్ని పలువురు గుర్తు చేశారు. 

Updated Date - 2020-07-05T08:00:04+05:30 IST