‘వైపీపీ పాలనలో దళితులపై పెరిగిన దాడులు’
ABN , First Publish Date - 2020-10-24T09:00:44+05:30 IST
వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిపోయాయని హైకోర్టు న్యాయవాది శ్రావణ్కుమార్
సీతానగరం, అక్టోబరు 23: వైసీపీ పాలనలో దళితులు, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిపోయాయని హైకోర్టు న్యాయవాది శ్రావణ్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలోని శిరోముండనం బాధితుడు ప్రసాద్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిపోతున్నాయని, అయినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు.