కొవిడ్.. విజృంభణ
ABN , First Publish Date - 2021-05-09T06:02:50+05:30 IST
నిడదవోలు పట్టణ, మండల గ్రామాల్లో మొత్తం 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు.
పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
నిడదవోలు, మే 8 : నిడదవోలు పట్టణ, మండల గ్రామాల్లో మొత్తం 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు తెలిపారు. పట్టణం లో శనివారం ఒక్కరోజే 15 కేసులు నమోదు కాగా మండలంలోని అట్లపా డు 3, డి.ముప్పవరం 4, కాటకూటేశ్వరం 1, మునిపల్లి 1, పందలప ర్రు 1, పురుషోత్తపల్లి 1, రావిమెట్ల 2, సమిశ్రగూడెం 1, శెట్టిపేట 2, తాళ్ళపాలెం 1, తిమ్మరాజుపాలెం 7, మొత్తం 24 కేసులు నమోదయ్యాయన్నారు. పట్టణ అర్బన్హెల్త్ సెంటర్ పరిధిలో 43 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు.
భీమడోలులో 32 మందికి..
భీమడోలు, మే 8:మండలంలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఆగడాలలంక–6, అంబర్పేట–2, భీమడోలు–12, గుండుగొలను–5, కోరుకొల్లు–1, పూళ్ళ–5, సూరప్పగూడెం–1 నమోదయ్యాయన్నారు.
అత్తిలిలో 26 మందికి..
అత్తిలి, మే 8 : మండలంలో 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యా యని డాక్టర్ ప్రసన్నకుమారి తెలిపారు. అత్తిలిలో 10, కె.సముద్రపుగట్టు 2, ఉరదాపాలెం1, పాలి 3, ఆరవల్లి 2, ఉనికిలి 2, పాలూరు 2, కంచుమర్రు, స్కిన్నెరపురం, కొమ్మర, మంచిలిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయన్నారు.
తణుకులో 19 మందికి..
తణుకు, మే 8 : పట్టణంలో శనివారం 19 కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. బాలుర ఉన్నత పాఠశాల యందు 708 మందికి వ్యాక్సిన్ అందించినట్లు వైద్యులు తెలిపారు.
పెంటపాడులో 15 మందికి..
పెంటపాడు, మే, 8 : మండలంలో పెంటపాడు, ముదునూరు పీహెచ్సీ పరిధిలో శనివారం 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. పడమరవిప్పర్రు 4, మీనవల్లూరు 3, బీ.కొండేపాడు 2, పెంటపాడు 2, కోరుమిల్లి, వల్లూరుపల్లి, కే.పెంటపాడు, పరిమెళ్ళ గ్రామాలలో ఒక్కో కేసు నమోదయ్యాయన్నారు.
ఉండ్రాజవరంలో 12 మందికి..
ఉండ్రాజవరం, మే 8 : మండలంలో శనివారం 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పీహెచ్సీ డాక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ తెలిపారు. కాల్థరిలో 2, సత్యవాడలో 4, ఉండ్రాజవరంలో 2, మోర్త, పాలంగి, సూర్యారావుపాలెం, వడ్లూరు గ్రామాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయన్నారు.
ఉంగుటూరులో 9 మందికి..
ఉంగుటూరు,మే 8 మండలంలో శనివారం 9 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయని చేబ్రోలు, కాగుపాడు పీహెచ్సీ వైద్యాధికారు లు తెలిపారు.
ఇరగవరంలో ఏడుగురికి..
ఇరగవరం, మే 8: ఇరగవరం, రేలంగి పీహెచ్సీ పరిధిలో శుక్రవారం ఏడు కేసులు నమోదయ్యాయని వైద్యులు బంగారు రవి, వై.యశోద తెలిపారు.