రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలి : సీపీఎం

ABN , First Publish Date - 2020-05-22T10:42:19+05:30 IST

రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని, వలస కార్మికులను బస్సుల్లో సొంత ప్రాంతాలకు తరలించాలని సీపీఎం

రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలి : సీపీఎం

ముషీరాబాద్‌/కవాడిగూడ/గోల్నాక/రాంనగర్‌, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా టెస్టులు పెంచాలని, వలస కార్మికులను బస్సుల్లో సొంత ప్రాంతాలకు తరలించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి, ముషీరాబాద్‌ కన్వీనర్‌ ఎం.దశరథ్‌, భోలక్‌పూర్‌ నాయకుడు కృష్ణస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


ఈ మేరకు వారు సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కవాడిగూడ తాళ్లబస్తీ, భోలక్‌పూర్‌, గోల్కొండచౌరస్తాలోని పార్టీ కార్యాలయ ఆవరణలో, కృష్ణకాంత్‌ పార్క్‌ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహం వద్ద ప్లకార్డులతో భౌతికదూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో కూడా వివిధ డివిజన్లలో నిరసన కార్యక్రమాలను ఆ పార్టీ నేతలు, ఎం.మహేందర్‌, డి.ఎల్‌.మోహన్‌ తదితరులు నిర్వహించారు.

Updated Date - 2020-05-22T10:42:19+05:30 IST