సర్కారు అప్పులపై సాక్షిలో పొంతన లేని కథనాలు: జీవీ రెడ్డి

ABN , First Publish Date - 2022-07-26T18:07:23+05:30 IST

Amaravathi: జగన్ సర్కారుపై (AP Govt) టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై సొంత పత్రిక సాక్షిలో తక్కువ

సర్కారు అప్పులపై సాక్షిలో పొంతన లేని కథనాలు: జీవీ రెడ్డి

Amaravathi: జగన్ సర్కారుపై  (AP Govt) టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy)  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై సొంత పత్రిక సాక్షిలో తక్కువ చూపించి రాయడం ఏమిటని ప్రశ్నించారు. ‘వైసీపీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేసిందని సాక్షిలో ప్రచురించుకున్నారు. అసలు పార్లమెంటులో అప్పులపై వచ్చిన సమాధానానికి సాక్షి పత్రికలో రాసినదానికి పొంతన లేదు. మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం లక్షా 30 వేల కోట్లే అని రాసుకోవడం తప్పు. వైసీపీ ప్రభుత్వం చిల్లర రాతలు రాయిస్తూ.. చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన అరియర్స్ ఇవ్వకపోగా.. వారు దాచుకున్న జీపీఎస్ నుంచి కూడా నిధులను వాడుకోవడం దుర్మార్గపు చర్య. కాంట్రాక్టర్ల (Contractor)కు  రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్షా 50వేల కోట్లు  చెల్లించాల్సి వుంది. పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవ్వాల్సిని నిధుల్ని ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వంలోని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన 7,660 కోట్లు వెనక్కి లాగేసుకున్నారు. ఆర్‌బీఐకి, సీఐజీ నుంచి తెచ్చుకున్న రుణాలపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.’ అని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-07-26T18:07:23+05:30 IST