ఎయిమ్స్కు నీటి సరఫరా చేయని అసమర్థ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-10-07T05:56:41+05:30 IST
ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్కు కనీస నీటి సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా
రెడ్డిగూడెం, అక్టోబరు 6: ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్కు కనీస నీటి సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వమిదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అన్నేరావుపేటలో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడున్నరేళ్లలో ఎయిమ్స్ కోసం ఏం చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ చేతకాని తనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదన్నారు. నేతలు, కార్యకర్తలనుసమస్యలను అడిగి తెలుసుకున్నారు.