దివాలా కంపెనీల షేర్ల కొనుగోలుకు ఐటీ మినహాయింపు
ABN , First Publish Date - 2020-07-01T06:14:33+05:30 IST
దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల షేర్లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికి ఆ మొత్తంపై ఐటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది...
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీల షేర్లను మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికి ఆ మొత్తంపై ఐటీ మినహాయింపు ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది. రుణాల ఊబిలో కూరుకుపోయిన యస్ బ్యాంకు షేర్ల కొనుగోలుదారులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది వర్తిస్తుందని ఆ ప్రకటనలో సీబీడీటీ తెలిపింది.