ఏపీ కీలక నేత మిత్రుడి వ్యాపారాలపై ఐటీ రైడ్స్.. వెలుగులోకి విస్తుపోయే అంశాలు

ABN , First Publish Date - 2021-12-30T02:56:23+05:30 IST

నగరంలో రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి..

ఏపీ కీలక నేత మిత్రుడి వ్యాపారాలపై ఐటీ రైడ్స్.. వెలుగులోకి విస్తుపోయే అంశాలు

హైదరాబాద్‌: నగరంలో రియల్ ఎస్టేట్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. అయితే ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. లెక్కల్లో చూపని రూ.100 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలకనేత మిత్రుడికి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. మణికొండలోని వ్యాపారి నివాసం, ఆఫీస్‌పై ఐటీ దాడులు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీలో ఏపీ అధికార పార్టీ నేత పెట్టుబడులున్నాయని ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల నుంచి సంస్థలోకి బ్లాక్‌మనీ వచ్చినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ దాడులను ఐటీ అధికారులు ధృవీకరించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Updated Date - 2021-12-30T02:56:23+05:30 IST