వర్మీ కంపోస్టుతో పంచాయతీలకు ఆదాయం
ABN , First Publish Date - 2020-07-02T11:50:39+05:30 IST
గ్రామాల్లో నిర్మించిన డంపుయార్డుల్లో తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువులతో పంచాయతీలకు ఆదాయం లభిస్తుందని నారాయణఖేడ్
పెద్దశంకరంపేట, జూలై 1: గ్రామాల్లో నిర్మించిన డంపుయార్డుల్లో తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువులతో పంచాయతీలకు ఆదాయం లభిస్తుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జేసీ నగే్ష అన్నారు. బుధవారం పెద్దశంకరంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో డంపుయార్డులు, వైకుంఠధామాలను వారు ప్రారంభించారు. పెద్దశంకరంపేట, శివాయిపల్లి, రామోజీపల్లిలో రైతు వేదికల నిర్మాణాలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళిపంతులు, సర్పంచులు సత్యనారాయణ, కుంట్ల రాములు, ప్రకాశ్, నరేశ్, సరితమల్లేశం , కవిత, మంజుల, రాణమ్మ, ఎంపీడీవో రాజమల్లయ్య, తహసీల్దార్ మనోహర చక్రవర్తి, ఏపీవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.